Cinema: ప్రేమమ్ అనే మలయాళం మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సాయిపల్లవి.. తన అందం, అభినయంతో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తర్వాత ఫిదా మూవీలో తెలంగాణ పిల్లగా యాస, భాష మాట్లాడుతూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరైంది. నేచురల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తర్వాత తెలుగు, తమిళంలో వరుసగా మూవీ ఆఫర్స్ అందుకున్న అమ్మడు.. వరసగా హిట్స్ అందుకుంది. నేచురల్ స్టార్ నానీతో కలిసి ఎంసీఏ మూవీలో యాక్ట్ చేసింది. ఇటీవలే నాగచైతన్యతో నటించి లవ్ స్టోరీ మూవీ సైతం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అక్క బాటలోనే చెల్లి..
ఇక సాయిపల్లివి చెల్లెలు పూజాకన్నన్ (Pooja Kannan) సైతం అక్క బాటలోనే నడుస్తున్నది. పూజాకన్నన్ మెయిన్ రోల్ లో నటించిన చిత్తారయి సెవ్వనం శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఇందులో యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని మెయిన్ రోల్లో యాక్ట్ చేశారు. ఫైట్ మాస్టర్గా గుర్తింపు తెచ్చుకున్న స్టంట్ సిల్వ ఈ మూవీతో డైరెక్టర్గా మరాడు.
సాయిపల్లవి పోస్ట్..
తాజాగా తన చెల్లి ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆ మూవీ గురించి మాట్లాడుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది నేచురల్ బ్యూటీ. నీ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుసుకోనుందని, అబద్దాలు చెబుతూ క్లాసులకు డుమ్మా కొట్టడం.. ఉత్సాహంతో ముందకు సాగటం వంటివి చేస్తూ నా ముందు ఎదిగావు.. ప్రస్తుతం మూవీతో ఆన్ స్క్రీన్ పైకి వచ్చావు. నా లాగే నా చెల్లిపైనా ప్రేమ, అభిమానాలు కురిపించాలని కోరుకుంటున్నా.. నా చెల్లిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పోట్ పెట్టింది సాయిపల్లవి.
ఇక ప్రస్తుతం రానా నటిస్తున్న విరాటపర్వం మూవీలో సాయి పల్లవి యాక్ట్ చేస్తోంది. నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్ అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండు మూవీస్ రిలీజ్కు రెడీగా ఉన్నాయి.