ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అయిన ఎంపీ విజయసాయి రెడ్డి గత కొద్ది కాలంగా పార్టీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జగన్ కు మరియు అతనికి సరిగ్గా పొసగడం లేదు అన్న వార్తలు వచ్చిన తర్వాత అతనికి ఇన్చార్జిగా ఇచ్చిన జిల్లాలలో కొన్ని కోత పెట్టిన విషయం కూడా తెలిసిందే. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లాం వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక సలహాదారు స్థానంలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పేషీ కి సంబంధించి కొన్ని కీలకమైన బాధ్యతలు నిర్వహించిన అజేయ నుండి కొన్ని శాఖలను తప్పించారు. ఆ శాఖలను వేరే వ్యక్తులకు జగన్ కట్టబెట్టారు.
అంతా ఆప్తుడిగా ఉండే అజయ్ కల్లాం నుండి ఈ బాధ్యతలను ఎందుకు తీసేసారు అని తలగోక్కుంటున్న టైం లో జగన్ అజేయ కల్లాం కి ‘ప్రమోషన్’ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అజయ్ కల్లాం బాధ్యతలు చేపట్టనున్నారని మరియు ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న విజయసాయి రెడ్డి కి మరోసారి కత్తెర పడనుంది అన్న వాదన మరొకసారి తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీ స్థాయి వ్యవహారాలకు సంబంధించి సాయి రెడ్డి విఫలమవుతూ వస్తున్నారు అని ఈ నేపథ్యంలోనే అజేయ కల్లాం పేరుని ముఖ్యమంత్రి ముందుకు తెచ్చి సాయిరెడ్డికి కోత విధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉన్న తర్వాత దాని తర్వాత మనకి పూర్తిస్థాయి స్పష్టత వచ్చేస్తుంది. ఇక సాయి రెడ్డి ఈ మధ్య పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చేసే రాజకీయాలు అందరికీ పెద్దదా రుచించలేదు అని.. అందుకే జగన్ వీలైనంత ఎక్కువగా సాయి రెడ్దికి రాజకీయాలు జరిపేందుకు స్కోప్ లేకుండా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అతనితో పాటు సజ్జల పేరు కూడా బయటకు రాగా.. ఇద్దరూ కావలసిన వారే కానీ కంట్రోల్ లో పెట్టబడవలసిన వారు అని జగన్ అభిప్రాయం అట.
అంతే కాకుండా రఘురామరాజు లాంటి మరొక రెబె లీడర్ కు సాయి రెడ్డి, సజ్జల లాంటి వాళ్ళ డామినేషన్ ను కారణంగా చూపే ఆస్కారం కూడా లేకుండా చేయడమే జగన్ లక్ష్యం లా తెలుస్తోంది. మరొకపక్క ఏడాది పాలన తర్వాత మార్పులు-చేర్పులు చేయడంలో పెద్దగా వింతేమీ లేదు కానీ సాయిరెడ్డి లాంటి వ్యక్తికి ఇలా వరుసబెట్టి కోతలు విధించడమే కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది మరి ‘అంతఃపుర రాజకీయాలు’ అంటే అలాగే ఉంటాయి అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.