టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి తో కళ తప్పిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ బంద్ అయ్యాయి.. థియేటర్స్ మూత పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద సందడి కరువయింది. అయితే అన్ లాక్ ప్రక్రియ తర్వాత సినిమాలన్ని మళ్ళీ సెట్స్ మీదకి వచ్చాయి. ఎప్పటి లాగే వందల మంది సినీ కార్మికులకి పని దొరికింది. థియేటర్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కాని 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో పెట్టిన పెట్టుబడి వస్తుందా.. లాభాల మాట అలా ఉంచితే నిర్మాత కనీసం కట్టిన వడ్డీలైనా వసూలవుతాయా.. ఇలాంటి ప్రశ్నలన్ని నిర్మాతల మనసుల్లో మెదిలాయి. అందుకే కొంతమంది ఓటీటీ వైపు చూశారు.
మంచి ఆఫర్ వస్తే సినిమాలని ఓటీటీలో రిలీజ్ కూడా చేశారు. అయితే భారీ హిట్ అవుతాయనుకున్న సినిమాలన్ని ఓటీటీ లో రిలీజై పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా థియేటర్స్ ఫీల్ మిస్ అవడం కూడా ఇందుకు ఒక ముఖ్య కారణం అని భావించారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయితేజ్ నటించిన లేటెస్ట్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్స్ లో రిలీజయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ మేకర్స్ ని తృప్తి పరచాయి. డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ప్రాణం పోసింది.
ఇదంతా సాయి తేజ్ క్రెడిబిలిటీ అని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారు. సాయి తేజ్ గనక ధైర్యం చేసి ఉండక పోతే ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మేకర్స్ అందరూ సంక్రాంతికి కూడా తమ సినిమాలని రిలీజ్ చేయాలా వద్దా అని డైలమాలో ఉండేవారు. కాని సాయితేజ్ ఊహించని విధంగా హోప్ ఇచ్చాడు. దాంతో మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాని.. అలాగే రాం రెడ్ సినిమాని సంక్రాంతి బరిలో దింపున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటు తన అరణ్య సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు మరికొన్ని సినిమాలు సంక్రాంతి రేస్ లో నిలవబోతున్నాయని సమాచారం.