Breaking: సైదాబాద్ ఘటన లో చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ వద్ద.. రాజు బలవన్మరణానికి పాల్పడినట్లు.. అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్లు.. సమాచారం. రాజు ని పట్టుకోవడం కోసం ఎప్పటినుండో పోలీసులు గాలిస్తున్నారు. అతని పట్టిస్తే పది లక్షల రివార్డు కూడా ప్రకటించడం జరిగింది.
గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల సరిహద్దుల మధ్య అదే రీతిలో హైవేలపై తెలంగాణ పోలీసులు రాజు ని పట్టుకోవడం కోసం.. బృందాలుగా విడిపోయి మరి గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో నిందితుడు రాజు మృతదేహం ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.