Sajjala Ramakrishna Reddy : రాష్ట్రంలో ఇటీవల దేవాలయాల గుడిలో విగ్రహాల ధ్వంసం ఘటనలో చాలా వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్ల రావటం అందరికీ తెలిసిందే.
పోలీసు విచారణలో కూడా ఇదే కావటంతో మరోపక్క సరిగ్గా ఎన్నికల సమయంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆగిపోవడంతో సామాన్య ప్రజల్లో కూడా అనేక అనుమానాలు ప్రతిపక్ష పార్టీపై నెలకొంటున్నాయి. ఇదిలా ఉంటే కోనసీమలో సరి కొత్త కుట్రకు టిడిపి పార్టీ రెడీ అయినట్లు ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళితే కోనసీమలో కాపు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల మధ్య గొడవలు పెట్టడానికి అంబేద్కర్, వంగవీటి మోహన్ రంగా విగ్రహాల ధ్వంసం చేయటానికి టిడిపి రెడీ అవుతున్నట్లు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్ర పన్నినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ పెట్టి .. ఆ నెపాన్ని ప్రభుత్వంపై వేయటానికి చంద్రబాబు కుయుక్తులు పన్ని నట్లు సజ్జల తెలిపారు. ఇంత దారుణమైన ఆలోచనలో ఆయనకే వస్తాయని, ముందు నుంచి చంద్రబాబు ఇలాంటి వివాదాలు సృష్టించడం అలవాటే అంటూ పేర్కొన్నారు. ఏది ఏమైనా సెన్సిటివ్ విషయాలను టార్గెట్ చేసి వైసిపి ప్రభుత్వంపై ఏదో రకంగా బురదజల్లడానికి అనేక పన్నాగాలు చంద్రబాబు అండ్ కో పన్నినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. విగ్రహాల ధ్వంసం చేసి దాన్ని మీడియాలో ప్రచారం చేసే యంత్రాంగం, అదేవిధంగా న్యాయవ్యవస్థలో ఆయనకు అనుకూలంగా వాదించే లాయర్లు ఉండటం తో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొన్నటి వరకు దేవాలయాల విగ్రహాలు ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు గోదావరి జిల్లాలను ఎన్నిక చేసుకున్నారని సజ్జల పేర్కొన్నారు.