Breaking: ఈరోజు ఉదయం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు సజ్జనార్. బస్ భవన్ లో వేదపండితులు ఆశీర్వచనం పలుకుతున్న సమయంలో.. పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది. అనంతరం ఈరోజు సాయంత్రం ఇదే బస్ భవన్ లో.. తెలంగాణ ఆర్టీసీ కీలక అధికారులతో సమావేశం కానున్నారు.
గతంలో సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా సజ్జనార్ దాదాపు మూడు సంవత్సరాల పాటు విధులు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సజ్జనార్ ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా ప్రమోట్ చేయడంతో ఈ రోజు.. ఆర్టీసీ ఎండీగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ గా స్టీఫెన్ రవీంద్ర ని తెలంగాణ ప్రభుత్వం నియమించడం జరిగింది.