Salaar: అల్ ఇండియా బ్లాక్బస్టర్ గా నిలిచిన కేజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానున్న తదుపరి చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం విధితమే. ఈ చిత్రంలో హీరో ప్రభాస్ సరసన శృతి హాసన్ రొమాన్స్ చేయనున్నది. అయితే ఇటీవల సోషల్ మీడియా లో ఈ చిత్రం గురించి ఒక విషయం వైరల్ అవుతోంది. అదేమిటంటే… సలార్ సినిమా ఒరిజినల్ కథ కాదట… ఇది ఓ కన్నడ సినిమాకు రీమేక్ అట… అయితే ఈ విషయాన్ని స్వయంగా సలార్ సినిమా సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.
ఇంటర్వ్యూయర్ రవిని ‘సలార్’ చిత్రం కన్నడ ‘ఉగ్రమ్’ చిత్రానికి రీమేక్ అని అంటున్నారు అందులో నిజం ఎంత ఉంది అని అడగగా దీనికి ఆయన చెప్పిన సమాధానంతో ప్రభాస్ అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు కానీ ఆయన చెప్పిన మరో మాటతో ఖుషి అయ్యారు. “సలార్ సినిమా రీమేక్ అని అందరికీ తెలిసిన విషయమే… కానీ ఆ సినిమాని తెరకెక్కిస్తున్నది ప్రశాంత్ నీల్… ఆయన సినిమాని ఎలా తీస్తారో ఇప్పటికే మీరు చూసారు. అది రీమేక్ అయినా అదే స్థాయిలో తీస్తారు” అంటూ సమాధానం ఇచ్చారు. ఇక దీనితో సలార్ ఒరిజినల్ స్టోరీ కాదు రీమేక్ అన్న క్లారిటీ వచ్చింది. సలార్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్తో పాటుగా ప్రశాంత్ నీల్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విలన్ విషయానికి వస్తే… కన్నడ యాక్టర్ మధు గురుస్వామి తో పాటుగా విజయ్ సేతుపతి కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!