Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చిన్న హీరోలు, హీరోయిన్లు అనుకోవడం సజహం. కానీ అలా అనుకున్న అందరికీ అవకాశం దక్కడం మాత్రం అంత సులభం కాదు. అలాంటిది ఏకంగా సల్మాన్ ఖాన్ మెగాస్టార్తో సల్మాన్ స్క్రీన్ షేర్ చేయడం అంటే ఇది నమ్మవచ్చా..అసలు అయ్యే పనేనా అని మాట్లాడుకోవడం సర్వ సాధారణం. కానీ ఇద్దరు సీనియర్ స్టార్స్ ఒకే ఫ్రేంలో కనిపించబోతున్నారు. రాం చరణ్తో కలిసి సల్మాన్ ఖాన్ నటించనున్నాడని గతంలో చాలాసార్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. కానీ ఆ కోరిక మెగా స్థాయిలో తీరనుంది.
రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్ రీసెంట్గా సెట్స్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ కూడా ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ సాంగ్ కూడా పూర్తి చేశాడు. ఇటీవల ఆచార్య పూర్తి చేసిన మెగాస్టార్ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆ సినిమా పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. కానీ లూసీఫర్ రీమేక్ మాత్రం అతికొద్ది సమయంలోనే పూర్తి చేయనున్నాడట.
Chiranjeevi : మెగాస్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని తెలుస్తోంది.
కాగా ఇందులో ఓ గెస్ట్ రోల్ ఉండగా ఆ రోల్ కోసం చిత్ర బృందం సల్మాన్ ఖాన్ను సంప్రదించారట. ఆయన ఈ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కనిపించేది కొద్దిసేపైనా మెగాస్టార్తో కనిపించే ఆ సీన్స్ హై ఓల్టేజ్లో ఉంటాయట. ఇక సల్మాన్ ఖాన్ మెగా ఫ్యామిలీ అత్యంత సన్నిహితుడు. ఎప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చినా ఖచ్చితంగా చరణ్తో పాటు మెగాస్టార్ను కలిసి వెళుతుంటారు. కాబట్టే మెగాస్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా రానుందట.