Salman Khan: సల్మాన్ ఖాన్ Salman Khan బాలీవుడ్ కండలవీరుడి సల్మాన్ సినిమా అంటే మినిమం మొదటిరోజే 100 కోట్లు వసూలు చేస్తుంది. ఇక హిట్ టాక్ వస్తే సినిమా కలెక్షన్లకు ఆకాశమే హద్దు. దబాంగ్ తర్వాత కొన్నేళ్లు వరుస హిట్స్ చూశారు. మధ్యలో కొన్ని ఫ్లాపులున్నా ఆయన ఇమేజ్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. రీసెంట్ గా ఆయన రాధే సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. ఇప్పుడు ఆయన తన తర్వాతి ప్రాజెక్టులో భాగం కావాల్సి ఉంది. అదే ‘టైగర్ 3’. అయితే.. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ జరిగే అవకాశం లేదు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా సెట్ ను ముంబైలో కూల్చేశారు.
ఈ ఏడాది మార్చిలోనే టైగర్ 3 సినిమా ప్రారంభమైంది. అయితే.. రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే సమయానికి కోవిడ్ తీవ్రత నేపథ్యంలో మహారాష్ట్రలో షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆపై హీరోయిన్ కత్రినాకైఫ్ కోవిడ్ బారిన పడింది. ఇవన్నీ దాటి పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్ కు వెళ్లడానికి టీమ్ సిద్ధంగా ఉంది. ఈక్రమంలో ముంబైలోని ఎస్ ఆర్పీఎఫ్ గ్రౌండ్స్ లో భారీ సెట్ వేశారు. అయితే.. ఇటివలి తౌక్తే తుఫాను దెబ్బకు సెట్ దాదాపుగా దెబ్బతింది. దీంతో ఇప్పుడీ సెట్ పాడైనచోట మళ్లీ నిర్మించాల్సి ఉంది. అయితే.. నిర్మాత ఆదిత్య చోప్రా మాత్రం.. సెట్ కు రిపేర్లు కాకుండా మొత్తం కూల్చేయాలన నిర్ణయించారు.
Read More:Shruti Haasan: మోస్ట్ డిజరబుల్ ఉమెన్ 2020.. శృతి హాసన్..! సమంత సెకండ్..
ఎందుకంటే.. మహారాష్ట్రలో లాక్ డౌన్ పెంచారు. షూటింగ్ కు ఎప్పుడు వెళ్తామనేది క్లారిటీ లేకుండా పోయింది. పైగా సెట్ పాడైంది. ఈక్రమంలో అనువైన పరిస్థితుల కోసం చూస్తూ సెట్ నిర్మించిన గ్రౌండ్స్ కు రెంట్ కట్టుకుంటూ వెళ్లి నష్టపోవడం కంటే.. సెట్ కూల్చేయడమే బెటర్ అని భావించారట. షూటింగ్స్ ప్రారంభమయ్యే సమయంలో కొత్త సెట్ నిర్మించుకోవచ్చనే ఆలోచనతోనే ఈ సెట్ ను పూర్తిగా కూల్చేయాలని డిసైడ్ అయ్యారట. ఏక్ థా టైగర్, టైగర్ జిందాహై.. సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న మూడో సినిమానే టైగర్. సినిమాలో ఇమ్రాన్ హష్మి కూడా నటిస్తూండటంతో సినిమాపై హైప్ పెరిగింది.