రాజ్యసభ ఎంపీ, ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఈరోజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అమర్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సింగపూర్ లో ఆయనకు కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారు.
ఐసీయూలో ఆయన పక్కనే కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమర్ సింగ్ కు భార్య పంకజ, ఇద్దరు కవల కూతుళ్లు ఉన్నారు. 2013లో కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడ్డారు అమర్ సింగ్. అయితే మళ్ళీ 2016లో రాజకీయాల్లో తిరిగి ప్రవేశించారు. ఈ ఏడాది మార్చ్ లో అమర్ సింగ్ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే టైగర్ జిందా హై అని తనదైన శైలిలో స్పందించారు అమర్ సింగ్. ఆయనకు 64 సంవత్సరాలు. ఈరోజు అమర్ సింగ్ తన ఫాలోయర్స్ కు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.