కుందనపు బొమ్మ సరికొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఏమ్మాయ చేశావే అంటూ కుర్రకారు మతులు పోగొట్టిన ఈ బ్యూటీ తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ బ్యూటీ సామ్ జామ్ టాక్ షోలో హోస్టర్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ బ్యూటీకీ ఈ షో ద్వారా రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నారన్న సంగతి కూడా తెలిసిందే..
అయితే ఈ భామ లాక్ డౌన్ మొదలు నుంచి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే ఈ బ్యూటీ లాక్ డౌన్ నుంచి తన ఫ్యామిలీతో అలా సరదాగా గడుపుతూ ప్ర కృతి ప్రేమికురాలిగా మారారు అక్కినేని సమంత. ఈ చిన్నదాని సినిమాల కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ బ్యూటీ తన అభిమానులను ఆశ్చర్యపరిచే వార్తను తీసుకొచ్చేసిందోచ్..
అదేంటంటారా.. అదే నండి ఈ కుర్రది ఇప్పుడు కొత్త మూవీలో సరికొత్త క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఆనందిపజేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీలో తన క్యారెక్టర్ చూసి అందరూ షాకవుతారని ఈ కుర్రది చెప్పుకొచ్చింది. సరికొత్త ఆలోచన విధానాలకు రూపం తీసుకొస్తున్న డిజిటల్ వేదికలకు రెక్కలొచ్చాయని టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత మాట్లాడారు. అయితే ఈ బ్యూటీ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ అనే వెబ్ సిరీస్ తో సమంత ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఈ సిరీస్ అన్ని భాషల్లోనూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
కాగా వచ్చే నెలలో రెండో సీజన్ ప్రేక్షకులకు కనువిందు చేయడానికి సిద్దమైంది. అయితే ఈ సిరీస్ 2 లో సమంత కనిపించనున్నారు. ఇందులో ఈ బ్యూటీ పూర్తిగా నెగిజీవ్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇందులో ఆమె తీవ్రవాదిగా కనిపిస్తుంది. అయితే దీనిపై ఆమె ఓ ఆంగ్ల మీడియా ద్వారా తన భావాలను బయటపెట్టారు. ఇప్పటి వరకు సాఫ్ట్ కార్నర్ లో నటించిన నేను అన్ని రూల్స్ ను బ్రేక్ చేసే అవకాశాన్ని నాకు ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కల్పించిందని అక్కినేని సమంత వ్యాఖ్యానించారు. కాగా ఇందులో నా క్యారెక్టర్ ను చూసి మీరు ఆశ్చర్యపోతారని ఆపిల్ బ్యూటీ చెప్పుకొచ్చారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!