Samantha : సమంత, నాగచైతన్య విడిపోయిన తర్వాత ఒక డైరెక్టర్కి ఎక్కువ నష్టం జరిగింది. వీళ్లిద్దరినీ నమ్మి సదరు డైరెక్టర్ ఇప్పుడు తీవ్ర నిరాశలో మునిగితేలుతోంది. అయితే సమంత, నాగచైతన్య కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల నెత్తిన పిడుగు పడిన ఆ డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.
Samantha : ఈ డైరెక్టర్ నెత్తిన పిడుగు పడింది
సమంత, నాగచైతన్య పరస్పర అంగీకారంతో విడాకులు బంధాన్ని తెంచుకున్నారు. ఈ విషయాన్ని ఆరు నెలల తర్వాత ప్రకటించారు. అయితే సినీ నటీనటుల్లో విడాకులు అనేవి సాధారణమే కానీ సామ్, చై విడాకుల కారణంగా టాలీవుడ్ డైరెక్టర్ నందిని రెడ్డి పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. వీరిద్దరిని నమ్ముకొని ఆమె కొత్త కష్టాలు తెచ్చుకుంది. వాళ్ళిద్దరిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఇప్పుడు ఆమె నిండా మునిగిపోయాననే బాధతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.
దీనికి కారణం ఏంటంటే
ఓ బేబీ సినిమా షూటింగ్ సమయంలో చైతన్య, సమంత కాంబోలో ఓ సినిమా చేయాలని నందినీ రెడ్డి భావించారు. కథ కూడా రెడీ చేయడంతో సమంత, నాగచైతన్య ఆమెతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కుతోందన్న సమయంలో సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటించారు. ఇప్పుడు ఎడమొహం, పెడమొహంగా ఈ జంట వ్యవహరిస్తుండడంతో నందినీ రెడ్డి పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. సమంత, చైతన్య మధ్య మాటల్లేవు. సామ్ స్వేచ్ఛ జీవి లాగా తనకు నచ్చినట్లు పెద్ద సినిమాలు చేసేస్తోంది. చైతన్య కూడా సమంత ఎవరో అన్నట్టు గా తన పని తాను చూసుకుంటున్నాడు. దీంతో ఈ సినిమా తెరకెక్కించడం అసాధ్యంగా మారింది. అలా నందినీ రెడ్డి బాగా నష్టపోయింది. అయితే ఇక్కడ ఓ అదృష్టం ఏంటంటే.. నందిని రెడ్డి ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ సినిమా స్టార్ట్ చేసి సగం వరకు తీసినట్లయితే .. అది ఇప్పుడు అర్ధాంతరంగా ఆగిపోయి ఉండేది. దీనివల్ల నందిని రెడ్డి తో సహా నిర్మాతగా కూడా బాగా నష్టపోయి ఉండేవాడు.