Samantha: టాలీవుడ్ అగ్రకథానాయికలలో ఒకరైనటువంటి సమంత వరుస చిత్రాలతో బిజీగా వున్న సంగతి తెలిసినదే కదా. ఇక ఇటీవల రిలీజైన పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ పాటతో తెలుగునాట కుర్రకారు మనసుల్ని దోచిందనే చెప్పుకోవాలి. అక్కినేని నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సమంత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇపుడు ఆమె కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.
Samantha: తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సమంత చెప్పిన విశేషాలు:
ఇకపోతే సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఒకరకమైన పోస్టులను పెడుతూ తాను ధైర్యంగా వున్నానని పరోక్షంగా చెప్పుకొచ్చింది. ఈ కోవలోనే తాను ఎదుర్కోన్న పరిస్థితులు, మానసిక సంఘర్షణ గురించి పలు పోస్టులు చేసింది. తాజాగా మరోసారి తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది సామ్. జీవితంలో తాను చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా చెప్పింది.
ఈ కార్యక్రమంలోనే సమంత తాజాగా పాల్గొంది!
తాజాగా రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఆమె అక్కడకి వెళ్ళింది. సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “నేను జీవితంలో చాలా మానసిక సమస్యలు ఎదుర్కోన్నాను. అలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్యులు నాకు ఎంతగానో సహాయం చేసారు. నేను ఈరోజు ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి వారే కారణం. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకు గాయం అయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలి.” అంటూ హితోపదేశం చేసింది.