Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సమంత త్వరగా ఈ వ్యాధి నుంచి కోల్కొని తను నటించిన లేటెస్ట్ చిత్రం శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో పాల్గొన్నారు.. సమంత అందం ఫెడ్ అవుట్ అయిందని.. సమంత అందంగా లేదంటూ..ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తున్నారు.. సమంత ఆ ట్రోల్స్ పై స్పందించగా.. తాజాగా సమంత పోస్ట్ పై బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా సమంతకు అండగా నిలిచారు..
సమంత శకుంతలం టైలర్ ఈవెంట్ కి రాగా.. కొందరు సమంత లుక్స్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేశారు. సమంతను చూస్తే జాలిగా ఉంది. ఆమె అందం బాగా తగ్గిపోయింది. విడాకుల తర్వాత ఆమె కెరీర్లో మంచి పొజిషన్లో ఉంటుందని అనుకుంటే.. మయోసైటిస్ ఆమెను మళ్లీ దెబ్బతీసింది. సామ్ను మళ్లీ బలహీనురాలిని చేసింది.. అంటూ అతి ప్రేమ కురిపించాడు. ఈ ట్రోల్స్ కు సమంత తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. నా లాగా కొన్ని నెలల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదని గట్టిగా కోరుకుంటున్నా.. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కూడా కొంచెం పంపిస్తున్నా.. అంటూ సామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఈ పోస్ట్ కు పలువురు సినీ ప్రముఖులు సమంతకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సమంత కు అండగా నిలిచారు. సదరు నెటిజన్ ట్వీట్కు స్పందిస్తూ.. మీరు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం క్లిక్ బైట్స్ కోసమే ఆలోచిస్తారు.. మీకు అందం కావాలంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. ఒక్కసారి సామ్ను కలవండి. తన గ్లో ఏంటో మీకే తెలుస్తుంది.. అని ట్రోలర్ చేసేవారికి గుబగుయ్యిమనే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.