సమంత ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమా కమిటవలేదన్న సంగతి తెలిసిందే. జాను డిజాస్టర్ తర్వాత మళ్ళీ సమంత తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. సక్సస్ ఫుల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో నటించింది. ఇది సమంత డెబ్యూ వెబ్ సిరీస్. అలాగే అల్లు అరవింద్ ఆహా కోసం సాం జాం అన్న టాక్ షో చేస్తోంది. ఇక రీసెంట్ గా తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి లతో కలిసి సమంత నటిస్తుండగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది.
కాగా ఈ సినిమాని విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో సమంత ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ అక్కినేని కోడలు మళ్ళీ తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తుందో అని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాని సమంత మాత్రం తన నెక్స్ట్ సినిమాని ఇంకా ప్రకటించలేదు. అయితే మళ్ళీ నాగ చైతన్య తో కలిసి మజిలీ వంటి డీసెంట్ సినిమా చేయాలని భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
కాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం అన్న సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించాడు. సొంత బ్యానర్ గుణ టీం వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతుండగా ఈ సినిమాలో శాకుంతలం గా నటించే హీరోయిన్ ఎవరన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో గుణ శేఖర్ ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి శాకుంతలం గా అనుష్క శెట్టి ఆ తర్వాత పూజా హెగ్డే నటించబోతున్నారన్న వార్తలు వచ్చి వైరల్ అయ్యాయి.
కాని తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సమంత ఈ సినిమాలో శాకుంతలం గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. గుణశేఖర్ చెప్పిన కథ సమంత కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని న్యూ ఇయర్ లో ఈ హీరోయిన్ ని అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. పాన్ ఇండియన్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో గనక సమంత నటిస్తే కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమా నిలవడం పక్కా అంటున్నారు.