ప్రస్తుతం సమంత అక్కినేని ఓ తమిళ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 షూటింగ్ కంప్లీటయింది. రీసెంట్ గా సమంత తన పాత్రకి స్వయంగా డబ్బింగ్ కూడా చెపుకుంది. ఈ వెబ్ సిరీస్ ని త్వరలో ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచి పోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది.
అయితే గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా మజిలీ సినిమాలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. పెళ్ళి తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన మజిలీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో అలాంటి కథ లు మళ్ళీ వస్తే చేయాలనుకుంటున్నట్టు ఇద్దరు ప్రకటించారు. ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం సినిమాలతో హిట్ పెయిర్ గా క్రేజ్ సాధించిన చైతు, సామ్ మజిలీ తో ఆ క్రేజ్ ని మరింతగా పెంచుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన జాను లో మళ్ళీ ఇద్దరు కలిసి నటించాల్సి ఉండగా కథ చైతూకి నచ్చకపోవడం తో డ్రాపయ్యాడు. ఎంతో నమ్మకం పెట్టుకొని చేసిన సమంత మాత్రం ఫ్లాప్ ని చూసింది.
అయితే ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి కూడా సమంత, నాగచైతన్య లతోనే ‘ మహా సముద్రం’ తెరకెక్కించాలనుకున్నట్టు వార్తలు వచ్చాయి. కాని ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఈ సినిమాని అజయ్ భూపతి శర్వానంద్ తో చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రకటన కూడా వచ్చింది. అయితే హీరోయిన్ గా సమంత ని నటింపచేయాలనుకున్నాడట అజయ్ భూపతి. కాని నాగ చైతన్య వద్దని చెప్పినట్టు తెలుస్తుంది. అందుకు కారణం సమంత, శర్వానంద్ కలిసి నటించిన జాను ఘోరంగా ఫ్లాపవడమే. ఈ కారణంగానే చైతూ సమంత ని మహాసముద్రం లో నటించ వద్దని చెప్పాడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.