అక్కినేని వారి కోడలు సమంత ఆహా చానల్లో సామ్ జామ్ అనే ప్రోగ్రాం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ షోకి ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా హాజరవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంకా చాలామంది ఈ షోకి రావడం జరిగింది. ఇదిలా ఉండగా సమంత కెరియర్ లో అప్పట్లో హీరో సిద్ధార్థ తో ప్రేమాయణం సాగినట్లు, కొన్ని కారణాల వల్ల విడిపోయినట్లు.. బాగా గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ విషయంపై తన కొత్త షో సామ్ జామ్ లో సమంత చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్ధార్థతో లవ్ ఎఫైర్ అతనితో అప్పట్లో ప్రేమలో పడిన సంగతి వాస్తవమే, కానీ అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే నా లైఫ్ మరో సావిత్రి గారి జీవితంలో మారేది అని తెలిపింది. ఆ విషయంలో ఎంతో డిస్టర్బ్ అయ్యాను.
కానీ అదే సమయంలో చైతు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది అది ప్రేమగా మారి చివరాకరికి పెళ్లి చేసుకునేలా చేసింది అని తెలిపింది. నిజంగా నా జీవితంలో నాగ చైతన్య రావటం అనేది దేవుడు ఇచ్చిన వరం అని, నాగచైతన్య లాంటి భర్త దొరకటం చాలా అదృష్టం అంటూ సమంత తన కొత్త షో లో చెప్పినట్లు సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా వరకు క్యారెక్టర్ సపోర్ట్ ఉన్న సినిమాలను ఒప్పుకుంటున్న సమంత, లాక్ డౌన్ తర్వాత ఎక్కువగా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం విలన్ గా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.