Samantha: అక్టోబర్ 2 వ తారీకు నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నట్లు ఇద్దరు వేరువేరుగా తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలియజేయడం తెలిసిందే. దాదాపు పది సంవత్సరాలు కలిసి ఉన్న వీరు ఆరు సంవత్సరాలు ప్రేమించుకుని నాలుగు సంవత్సరాలు దాంపత్య జీవితం జీవించి.. ఇటీవల విడిపోవడంతో.. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎంతగానో విచారం వ్యక్తం చేశారు. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి అన్న దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో సమంత ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు గేమ్ ఆడటానికి వస్తూ ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎన్టీఆర్ చేస్తున్న ఈ కార్యక్రమం టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతుంది. ఇండస్ట్రీ కి సంబంధించిన టాప్ సెలబ్రిటీలు వరుసగా వస్తూ ఉన్నారు. ప్రారంభంలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వగా తర్వాత.. కొరటాల శివతో కలిసి రాజమౌళి గేమ్ ఆడారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా.. వస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
సమంతతో ఎన్టీఆర్ స్పెషల్ ఎపిసోడ్
ఇటువంటి తరుణంలో తాజాగా స్టార్ హీరోయిన్ సమంత .. త్వరలో ఈ షోలో రానున్నట్లు సమాచారం. దసరా నేపథ్యంలో సమంతతో ఎన్టీఆర్ ఆడే స్పెషల్ ఎపిసోడ్ గా చిత్రీకరించడానికి షో నిర్వాహకులు ఇప్పటికే ప్లాన్ చేసినట్లు… ఈ దసరా లేకపోతే వచ్చే నెల ప్రారంభంలో సమంత ఆడే గేమ్ షో ప్రసారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ షో లో సమంత విడాకుల ప్రస్తావన తీసుకు వస్తుందో లేదో… విడాకుల వార్తల పై వస్తున్న రకరకాల పుకార్లకు చెక్ పెడుతుందో లేదో.. అన్నది సస్పెన్స్ గా నెలకొంది.