సమంత అక్కినేని జాను ఫ్లాప్ తర్వాత మళ్ళీ సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్న సమంత కి జాను షాకివ్వడంతో నెక్స్ట్ సినిమాని ఎంతో ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. ముఖ్యగా పెళ్ళి కి ముందు మాదిరిగా కమర్షియల్ సినిమాలని, గ్లామర్ రోల్స్ ని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. మజిలీ, ఓ బేబీ తరహా సినిమాలు అందులోను ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగానే మరోసారి ఓ బేబీ దర్శకురాలు నందినీ రెడ్డి తో సినిమా కమిటయిందని అంటున్నారు. కాని ఇంకా అధికారకంగా ఈ ప్రాజెక్ట్ వెల్లడి కావాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో కీలక పాత్ర పోషించింది. ఈ పాత్ర తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది సమంత. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ రోల్ పోషించింది. అలాగే ఒక తమిళ సినిమాలో నటిస్తుందన్న సమాచారం కూడా ఉంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నయనతార కూడా నటిస్తుండటం విశేషం.
అయితే తాజాగా సమంత మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. లేడీ మల్టీ స్టారర్ గా తెరకెక్కబోయో ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మరో హీరోయిన్ గా నటిస్తుందట. సమంత, రష్మిక సిస్టర్స్ గా నటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరికి కథ నచ్చిందని త్వరలో అధికారకమైన ప్రకటన వెలువడనుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాని 2021 ప్రథమార్థం లో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఇక రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప అన్న పాన్ ఇండియా సినిమాతో పాటు ఒక తమిళ సినిమా, ఒక కన్నడ సినిమా నటిస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!