కరోనా నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన్నప్పటి నుంచి సినిమా షూటింగ్లు ఆగిపోయినందున టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత OTT ల పైనే తన దృష్టి పెట్టింది. `జాను` ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో సామ్ గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.ఈ గ్యాప్ లో ఇంటి రూఫ్ టాప్ పై వ్యవసాయం, సాకీ డ్రెస్ బ్రాండ్ ప్రచారం, స్కూల్ బిజినెస్ వంటి కొత్త కొత్త వ్యాపకాలపైకి తన ధ్యాసని మలిచింది. సోషల్ మీడియాలో వుంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటారు సామ్. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన విషయాల్ని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి, రిలాక్స్ అయ్యి `ఆహా` ఓటీటీకి కోసం ఇపుడు మళ్ళి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అక్కినేని కోడలు. ఈ సారి ఎవ్వరు ఊహించని విధంగా హోస్ట్ గా వ్యవహరిస్తూ టాక్ షో చేస్తున్నారు. ఆహ లో ప్రసారమవుతున్న ఈ టాక్ షో పేరు `సామ్ జామ్`. ఈ టాక్ షోలో హీరో విజయ్ దేవరకొండ మొదటి గెస్ట్. విజయ్ తరువాత రానా, నాగ్ అశ్విన్, సైనా నెహ్వాల్ ఈ టాక్ షోలో గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఈ టాక్ షో కోసం సామ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి జవాబు తెలిసిన వారు షాక్ ఐపోతున్నారు. ఈ టాక్ షో కోసం సామ్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసిందట. ఈ టాక్ షో లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లకు గానూ సమంత కోటి రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. కేవలం ఎనిమిది ఎపిసోడ్ లకు కోటి రూపాయలా! అని స్టార్ హీరోయిన్స్ షాకవుతున్నారట.
previous post