టాలీవుడ్ నటి అక్కినేని సమంత సరికొత్త ప్రోగ్రాంతో ఆడియెన్స్ ను అలరించడానికి సిద్దమవుతోంది. సినిమాల్లో బిజీ బిజీ గా గడిపే ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై యాంకర్ గా మారబోతోంది. ప్రముఖ సెలబ్రిటీలతో వారి మనస్సులోని భావాలను వ్యక్తపరిచేందుకు సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మడు. ఈ స్పెషల్ ప్రోగ్రాంతో మరి సమంత ఫ్యాన్స్ ఫిదా అవుతారేమో వేచి చూడాలి మరి.
లాక్ డౌన్ నుంచి అక్కినేని సమంత సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ లాక్ డౌన్ నుంచి సమంత తన లో దాగున్న ప్రతిభను బయటపెడుతుందనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్ర కృతి ప్రేమికురాలిగా మారిపోయింది ఈ భామ. అలాగే తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ సంతోషంగా గడిపిందనే చెప్పుకోవచ్చు. కాగా ఈ అందాల రాశి తాజాగా సామ్ జామ్ అనే టాక్ షో కు ఫుల్ టైమ్ హోస్టర్ గా చేయబోతోంది.
ఈ షో చేయడానికి గాను ఆమె ఒక్క ఎపిసోడ్ కు రూ.40 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే కాబోలు ఈ షోను చేయడానికి ఆమె ముందుకు వచ్చిందని చాలా మంచి అనుకుంటున్నారు. కాగా ఈ షో అల్లు అరవింద్ ఆధ్వర్యంలో ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో జరగబోతోంది. కాగా ఈ షోకు దర్శకురాలు నందిని రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఈ షో నాకు చాలెంజింగ్ గా నిలవబోతుందని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా ఈ షో చేయడం కంటే సినిమాల్లో నటించడమే చాలా ఈజీ అని ఆమె తెలిపారు. బిగ్ బాస్ లో హోస్ట్ గా ఒక్క రోజు చేయడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటిది ఈ షో చేయడానికి నేను మరింత కష్టపడాలని సమంత చెప్పుకొచ్చారు. అలాగే ఈ షోకు వచ్చే ప్రముఖ వ్యక్తులు చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సైనా నెహ్వాల్ లాంటి సెలబ్రిటీలతో సమంత ముచ్చటించనుంది. కాగా ఈ టాక్ షో లో సెలబ్రిటీలతో వారి పర్సనల్ విషయాలే కాకుండా సమజంలోని సమస్యలపై కూడా సమంత చర్చించనుంది.