ఓ బేబీ ఓ బేబీ అంటూ… అంటూ ఎన్నో సినిమాల ద్వారా ఎంతో గౌరవం సంపాదించిన కుందనపు బొమ్మ సామ్ జామ్ తో వెండితెరపై తలుక్కుమననున్నారు. ప్రముఖ సెలబ్రిటీలతో టాక్ షో చేయడానికి సిద్దమైంది ఈ కుందనపు బొమ్మ. కాగా ఈ బ్యూటీ ఈ షో కు ఒక్క ఎపిసోడ్ కు సుమారుగా రూ.40 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న విషయం తెలిసిందే.. కాగా సినిమాల్లో నటించకపోయినా ఈ అమ్మడు ఆదాయం భాగానే సంపాధించేస్తుంటుంది.
అందరికీ దక్కని లక్ అక్కినేని సమంతకు దక్కిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆహా ఎంటరైటైన్ మెంట్ కోసం సామ్ జామ్ అనే టాక్ షో ను నిర్వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. దీనికి మన ముద్దుగుమ్మ అక్కినేని సమంత హోస్ట్ గా చేస్తున్నారు. కాగా ఈ షో మరికొద్ది రోజుల్లో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతోంది.
ఈ షోలో ముందుగా యూత్ ఫేవరెట్ గా మారిన విజయదేవరకొండతో ఈ టాక్ షో నిర్వహించనున్నారు సమంత. ఈ షో లో సమంత అర్జున్ రెడ్డి పర్సనల్ విషయాలను బయటకు తెచ్చే క్వశ్చన్స్ అడగనున్నారట ఈ బ్యూటీ. మన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండలో దాగున్న అన్ని విషయాలను, ఆయన పెట్టుకున్న ఎఫైర్స్ ను బయటపెడతారట ఈ ముద్దుగుమ్మ. మరి దానికి కారణాలు లేకపోలేదని చాలా మంది అనుకుంటున్నారు.
ఈ మధ్య విజయ దేవరకొండకు, రష్మిక మందాని మధ్య కెమిస్ట్రీ ని చూసి చాలా మంది వీరి మధ్యన ఏదో ఉందంటూ పుకార్లు కూడా పుట్టించారు. వీరిరువురు చేసిన సినిమాలు చూస్తే వీరి మధ్యనున్న కెమిస్ట్రీ అలా కనబడుతుంది మరీ. అందుకే కాబోలు సమంత ఎఫైర్స్ గురించి క్లారిటీగా తెలుసుకోవడానికి ప్లాన్ చేసినట్టున్నారు. చాడాలి మరి మన అర్జున్ రెడ్డి సమంత క్వశ్చన్లకు ఏవిధంగా సమాధానం చెబుతారనేది.