Samantha : సమంత శాకుంతలం సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. మజిలీ, ఓ బేబీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న సమంత హ్యాట్రిక్ హిట్ కొట్టాలని జాను సినిమా చేసింది. కాని సమంత కి జాను షాకిచ్చింది. భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ సమంత నుంచి మళ్ళీ ఏ సినిమా రాలేదు. సమంత అభిమానులు సమంత నుంచి కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో అని ఎంతగానో ఆతృతగా ఎదురు చూశారు. మజిలీ వంటి సినిమా మళ్ళీ సమంత – నాగ చైతన్య కలిసి చేస్తారన్న టాక్ కూడా వినిపించింది.
కాని అనూహ్యంగా గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం అన్న పౌరాణిక సినిమా చేస్తున్నట్టు ప్రకటించి భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. నిజంగా సమంత కెరీర్ లో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు. అందుకే ఈ సినిమా మీద అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కావ్య నాయకి గా సమంత అద్భుతమైన పాత్రలో కనిపించబోతోంది. తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది.
Samantha : సమంత శాకుంతలం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.
కాగా తాజా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. సమంత శాకుంతలం మార్చ్ 15 నుంచి సెట్స్ మీదకి రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారు. దాదాపు సెట్స్ నిర్మాణం కంప్లీట్ అవగా ఇక షూటింగ్ కి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు గుణశేఖర్. ఇక ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిస్తుండగా తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమా తర్వాత సమంత లాంగ్ గ్యాప్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!