Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ‘పెళ్లి’పై ఓ ఆసక్తికర సందేశాన్ని పోస్ట్ చేసింది. సమంత చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారితీసిందనే చెప్పాలి. ఆడపిల్లల్ని ధైర్యంగా పెంచాలంటూ భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ తాజాగా ఓ పోస్ట్ని (POST) షేర్ చేయగా.. ఆ పోస్ట్ సామ్ కు విపరీతంగా నచ్చేసింది. దీనితో సమంత(Samantha) రాణి రాంపాల్ పోస్ట్ని తన ఖాతాలో పోస్ట్ చేసుకుంది.
Samantha : సమంత జీవితాన్ని మార్చేయబోతున్న ఆ ఇద్దరు..?
సామ్ మెచ్చిన పోస్ట్ ఇదే :
హాకీ జట్టు కెప్టెన్ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. ‘‘మీ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏంటి అని బాధపడకుండా ఆమెను శక్తివంతురాలుగా తయారు చేయండి. ఇప్పటి నుండే కుమార్తె పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టడానికి బదులు ఆమె చదువుపై ఖర్చుపెట్టండి. తన కాళ్లపై తాను నిలబడగలిగేలా పెంచండి. ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భయపడకుండా నిలబడగలిగేలా జీవించడం ఆమెకి నేర్పించండి’’ అనే మెసేజ్ ను రాణీ రాంపాల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ నచ్చడంతో సమంత దాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Samantha: “నా మీద కేసు పెడతావా .. నా దగ్గర ఆధారం ఉంది ఇదిగో ” అంటూ ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన
దశాబ్దకాలం నాటి సామ్ -చైతూల ప్రేమ :
సామ్, చైతూల ప్రేమ ఒక దశాబ్ద కాలం నాటిది. పెళ్లి అయ్యి నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న వీరు విడాకులు తీసుకోవడం పట్ల అందరూ చాలా బాధ పడ్డారు. ఈ నేపథ్యంలోనే సామ్ ‘అమ్మ చెప్పింది’ అంటూ తన అభిప్రాయాలను, ఆలోచనలను పలు సందేశాల రూపంలో ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ (instagram) లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ అభిమానులు వీరి విడాకుల విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. !
Samantha – Naga Chaitanya: నాగ చైతన్య కోసం సమంత అన్ని త్యాగాలు చేసిందా …?