నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరియర్ స్పీడ్ అందుకుంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇద్దరు విడాకులు తీసుకోగా తర్వాత నుండి సమంత కొద్దిగా డౌన్ అయిన గాని మళ్ళీ పుంజుకుని ఇప్పుడు బాలీవుడ్ ఇంకా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా అవకాశాలు అందుకుంటూ తిరుగులేని హీరోయిన్ గా మళ్లీ సత్తా చాటుతుంది. ముఖ్యంగా “పుష్ప” లో చేసిన ఐటమ్ సాంగ్ తో… సమంతకి మంచి పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా లభించింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలతో పాటు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగులో విజయ్ దేవరకొండతో “ఖుషి” అనే సినిమా సమంత చేస్తూ ఉంది.
ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ షో… “కాఫీ విత్ కరణ్” లో సమంత పాల్గొనడం జరిగింది. ఈ షోలో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం చాలా కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇద్దరి మధ్య విడాకులు అనేది ఆషామాషీగా జరగలేదని.. తనదైన శైలిలో సమంత చాలా సీరియస్ గానే మాట్లాడటం జరిగింది. దేశంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ జాబితాకి సంబంధించి ఆర్ మ్యాక్స్ సంస్థ చేసిన సర్వేలో ఇటీవల సమంత నంబర్ వన్ స్థానంలో నిలవడం జరిగింది.
సమంత తర్వాత బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భట్, నయనతార, పూజా హెగ్డే కరీనాకపూర్ నిలిచారు. ఆర్ మ్యాక్స్ సంస్థ సర్వేలో నెంబర్ వన్ సానాన్ని ఎలా దక్కించుకున్నారు అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు. దానికి సమంత సమాధానం ఇస్తూ నిజం చెప్పనా అంటూ తాను ఆ సంస్థకి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే సరదాగా కామెంట్లు చేసినట్లు తెలపగా.. అయినప్పటికీ సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీగా మారాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?