తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కరోనాతో మృతి చెందడంతో తిరుపతిలో ఉప ఎన్నిక జరగనుందని అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికలు జరగలేదు. జరగాల్సిన లోకల్ ఎలక్షన్లు కూడా మహమ్మారి వల్ల వాయిదా పడడం జరిగాయి.
ఇలాంటి తరుణంలో తిరుపతి ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎలాగైనా ఈ ఎన్నికలలో సత్తా చాటాలని తెగ ఆరాటపడుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి ఎన్నికలలో సత్తా చాటడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలు జగన్ ప్రభుత్వానికి రెఫరెండం గా భావిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఉపఎన్నికలు వాతావరణం బట్టిచూస్తే పోటీ ప్రతిపక్ష పార్టీ టిడిపి అధికార పార్టీ వైసిపి మధ్య ఉన్నట్టు తెలుస్తోంది.
రిజర్వు నియోజకవర్గమైన తిరుపతి లోక్ సభ స్థానంలో ఒకసారి జరిగిన ఎన్నికలలో వైసిపి రెండు లక్షల మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు వైసిపి ప్రతిపక్షంలో ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ప్లాన్ చూస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి కచ్చితంగా మెజార్టీ పెరగాలని పార్టీ నేతలతో అంటున్నారట. తిరుపతి ఉప ఎన్నిక రిజల్ట్ తో దేశం మొత్తం వైసీపీ వైపు చూసేలా ఫలితాలు రాబట్టాలని పార్టీ కేడర్ కి సూచించారట.
పరిస్థితి ఇలా ఉండగా టిడిపి పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ని అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వైసిపి పార్టీ అభ్యర్థిగా పాదయాత్ర లో జగన్ కాలుకు కట్టు కట్టిన డాక్టర్ గురుమూర్తికి టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క బిజెపి జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇదిలా ఉంటే ఈ జరగబోయే ఉప ఎన్నికలలో వైసీపీ పార్టీకి అతిపెద్ద ప్లాన్తో అధికారంలో ఉండటమే కాకుండా తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో ఉండటంతో.. కచ్చితంగా జగన్ ప్లాన్ చేస్తున్న ఆలోచన మేరకు మెజారిటీ రావటం గ్యారెంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏమాత్రం ప్రజలలో వ్యతిరేకత ఉంటే మాత్రం టీడీపీకి ఓట్లు పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?