Sampath Nandi: డైరెక్టర్ సంపత్ నంది అందరికీ సుపరిచితుడే. కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో “రచ్చ” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి అవకాశం అందుకున్న సంపత్ నంది.. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి సినిమా ప్రాజెక్టు ఆగిపోవటంతో.. రవితేజ తో బెంగాల్ టైగర్ చేయడం జరిగింది. రవితేజ హీరోగా 2015లో వచ్చిన బెంగాల్ టైగర్ పర్వాలేదనిపించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత ఏడాది గోపీచంద్ హీరోగా “సిటీమార్” తీయగా అది యావరేజ్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మెగా హీరోతో సంపత్ నంది సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆ మెగా హీరో మరెవరో కాదు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ నటించిన చివరి సినిమా “రిపబ్లిక్”. ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల అవుతున్న తరుణంలో సాయి యాక్సిడెంట్ కి గురి కావడం తెలిసిందే. అయితే చాలా కాలం విశ్రాంతి లో ఉన్న సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇప్పుడు దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
హై వోల్టేజ్ యాక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం కార్తీక్ అనే కొత్త దర్శకుడితో కూడా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంపత్ నంది సినిమా మరి కొద్ది నెలల్లో స్టార్ట్ కానున్నట్లు సమాచారం.