బడ్జెట్ ధరలో లభించే ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా ? అయితే శాంసంగ్ మీ కోసమే ఓ కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం01 కోర్ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. ఇది చాలా తక్కువ ధరను కలిగి ఉంది. ఈ ఫోన్కు చెందిన 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.5,499 గా ఉంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.6,499గా ఉంది.
గెలాక్సీ ఎం01 కోర్ ఫోన్లో 5.3 ఇంచుల డిస్ప్లేను ఇచ్చారు. క్వాడ్కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ ఉంది. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ జూలై 29 నుంచి వినియోగదారులకు లభిస్తుంది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ 10 గో ఎడిషన్ ఓఎస్ను ఇందులో ఇచ్చారు. డ్యుయల్ 4జి సిమ్లను వేసుకోవచ్చు.