గెలాక్సీ నోట్ 20, నోట్ 20 అల్ట్రా స్మార్ట్ఫోన్స్ను శాంసంగ్ ఆవిష్కరించింది. కరోనా వల్ల ఆ కంపెనీ వర్చువల్ ఈవెంట్లో ఈ ఫోన్లను ప్రదర్శించింది. గెలాక్సీ నోట్ 20లో.. 6.7 ఇంచుల డిస్ప్లే ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ ఉన్నందున ఫోన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 8జీబీ ర్యామ్తో 128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఇచ్చారు. 4జి డ్యుయల్ సిమ్లు వేసుకోవచ్చు. వెనుక వైపు 12, 64, 12 మెగాపిక్సల్ కెమెరాలు 3 ఉన్నాయి. ముందు వైపు 10 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు.
గెలాక్సీ నోట్20 ఫోన్కు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. డాల్బీ అట్మోస్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి. 5జికి సపోర్ట్ ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్టు ఇచ్చారు. 4300 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ను పొందవచ్చు.
గెలాక్సీ నోట్ 20 అల్ట్రా స్మార్ట్ఫోన్లో.. 6.9 ఇంచుల డిస్ప్లే ఇచ్చారు. దీనికి కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. నోట్ 20 ప్రాసెసర్నే ఇందులోనూ ఇచ్చారు. 8, 12 జీబీ ర్యామ్, 128, 256, 512 స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదలైంది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉంది. వెనుక వైపు 108, 12, 12 మెగాపిక్సల్ కెమెరాలు 3 ఉన్నాయి. ముందు వైపు 10 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇందులోనూ 5జికి సపోర్ట్ ఇచ్చారు. ఈ ఫోన్లో 1టీబీ వరకు మెమొరీ కార్డు వేసుకోవచ్చు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి కూడా ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ ఇచ్చారు.
గెలాక్సీ నోట్ 20 ప్రారంభ ధర రూ.84,500 ఉండగా, నోట్ 20 అల్ట్రా ప్రారంభ ధర రూ.97,230గా ఉంది. ఆగస్టు 21 నుంచి ఈ రెండు ఫోన్లను కొనవచ్చు.