అర్జున్ రెడ్డి హిట్ తో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ ను సృష్టించింది. యూత్ ఆడియన్స్ పరంగా తెలుగు సినిమాని వేరే లెవల్లో నిలబెట్టింది. అర్జున్ రెడ్డి వంటి క్యారెక్టర్ కి నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమా హిట్ తర్వాత తెలుగులో 2వ సినిమా చేస్తాడనుకుంటే బాలీవుడ్ బాట చెక్కేసాడు సందీప్ రెడ్డి. ఇదే అర్జున్ రెడ్డి సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు.
దీంతో బాలీవుడ్ లో సందీప్ రెడ్డి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే బాలీవుడ్ లో వరుస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి. లేటెస్ట్ గా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా టి సిరీస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ.. సందీప్ తో సినిమా తీసేందుకు ముందుకు వచ్చిందట. సందీప్ రెడ్డి – రణ్ బీర్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోందన్న టాక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని సమాచారం. కాగా బాలీవుడ్ లో కబీర్ సింగ్ తర్వాత తన నెక్స్ట్ మూవీ పై ఎలాంటి ప్రకటన చేయలేదు సందీప్ రెడ్డి.
అయితే ఈ ప్రాజెక్ట్ ఏవి సెట్స్ మీదకి త్వరగా రాకపోవడంతో.. ఈ లోపు టాలీవుడ్ లో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు సందీప్. అందుకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు కథలు వినిపించారు. ఇవేవీ వర్కౌట్ అవకపోవడం తో మళ్లీ బీ టౌన్ కే వెళ్లిపోయాడు. ప్రస్తుతం రణ్ బీర్ చేస్తున్న బ్రహ్మస్త్ర, సం షేర్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కంప్లీట్ కాగానే సందీప్ రెడ్డి తో సినిమా మొదలవనుందని అంటున్నారు. అయితే టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీయడం కాస్త మైనస్ అయిందన్న కారణంగా మళ్ళీ తెలుగు సినిమా కి దర్శకత్వం వహించే ఛాన్స్ రావడం లేదని అంటున్నారు.