Wimbledon 2022: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలవాలనుకున్న భారత టెన్సిస్ దిగ్గజం సానియా మీర్జా కల నెరవేరలేదు. క్రొయేషియాకు చెందిన తన భాగస్వామి మేట్ పవిచ్ తో కలిసి అద్భుత ఆటతో సెమీ ఫైనల్స్ కు దూసుకొచ్చిన సానియా ఫైనల్ చేరుకోలేకపోయింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్స్ లో సానియా – పవిచ్ జోడీ 6-4, 5-7, 4-6 స్కోర్ తేడాతో యూఎస్ – బ్రిట్సీ జోడీ డెసిరే క్రాజిక్, నీల్ స్ముప్స్కీ జంట చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను సులువుగా నెగ్గిన సానియా – పవిచ్ జోడీ రెండో సెట్ లో 2-0 తో ఆధిక్యం సాధించి సులభంగా మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ గొప్పగా పుంజుకున్న ప్రత్యర్ధి జంట రెండో సెట్ తో పాటు మూడు సెట్ కూడా నెగ్గి సానియా – పవిచ్ జోడీని ఓడించింది. దీంతో తన కేరీర్ లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా ఒక్క మిక్స్డ్ డుబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కేరీర్ కు ముగింపు పలుకనుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వింబుల్టన్ మిక్స్డ్ లో సానియా సెమీ ఫైనల్స్ వరకూ రావడం ఇదే తొలిసారి. అయితే వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, అస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. మొత్తంగా సానియా ఖాతాలో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ తర్వాత సానియా కేరీర్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. 2001 లో జూనియర్ స్థాయిలో ప్రారంభమైన సానియా వింబుల్డన్ ప్రయాణం 21 ఏళ్ల తరువాత ఇప్పుడు ముగిసింది.