Saniya Meerja: భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది.. ఇటీవల సానియా మీర్జా తన రిటైర్మెంట్ ను ప్రకటించింది.. కాగా టెన్నిస్ లో ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్ లో తన చివరి మ్యాచ్ ఆడాలని ఆశించింది.. సానియా మీర్జా అభిమానుల కోసం ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఫెయిర్ వెల్ మ్యాచ్ ఆడనుంది.. దాంతో హైదరాబాద్ లోని అభిమానులు సానియా మీర్జా లాస్ట్ మ్యాచ్ ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..
హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో తనకు ఉన్న అనుబంధం గురించి సానియా మీర్జా గుర్తు చేసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించబోతున్నానని ఆమె తెలిపారు. 2003లో టెన్నిస్ స్టార్ట్ చేసిన సానియా.. సుమారు రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ లో ఆడి రాణించింది. ఫిబ్రవరి 21న దుబాయ్లో జరిగిన టోర్నీలో మొదటి రౌండ్ లోనే ఓటమిపాలైంది. టెన్నిస్ కి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఆస్ట్రేలియా ఓపెన్ లో పోటీపడిన సానియా మీర్జా రన్నర్ ఆఫ్ తో సరిపెట్టుకుంది.
సానియా తన కెరియర్ మొత్తంలో ఆరు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలుచుకుంది . మాటిన హిందీస్ తో కలిసి మూడు ఉమెన్స్ డబుల్ టైటిల్స్ గెలుచుకుంది . మహేష్ భూపతి తో కలిసి మరో రెండు టైటిల్స్ సొంతం చేసుకుంది. ఆసియా క్రీడల్లో ఎనిమిది పతాకాలు గెలిచిన సానియా మీర్జా కామన్వెల్త్ గేమ్స్ లో కూడా రెండు పతాకాలు సాధించింది. ఒలంపిక్స్ పతాకం కోసం శ్రమించిన అది కలగానే మిగిలిపోయింది. 2009లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకుంది.