Mahesh babu: సూపర్ స్టార్ మహేశ్ హీరోగా ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా రూపొందుతోంది. గీత గోవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిన పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మహేశ్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ – 14 రీల్స్ ప్లస్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం ఈ సినిమాకు హైలెట్గా నిలవబోతోంది.
ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగాల్సి ఉండగా మూడు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్న కారణంగా సోలో డేట్ చూసుకొని 2022, ఏప్రిల్ 1న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే జనవరి నుంచి మహేశ్ బాబు కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనుకున్నాడు. అయితే మోకాలికి సర్జరీ ఉన్న కారణంగా రెండు నెలలు ఆలస్యంగా ఈ ప్రాజెక్ట్ మొదలబోతోంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్తో నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Mahesh babu: దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వస్తుందంటున్నారు.
ఇటీవలే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రకు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ నటించబోతున్నారని టాక్ మొదలైంది. కేజీఎఫ్ 2లో సినిమాలో సంజయ్ దత్ అధీరాగా చాలా పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఈ మూవీ లుక్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సౌత్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో మహేశ్ బాబుకి విలన్గా సంజయ్ దత్ను ఎంపిక చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వస్తుందంటున్నారు.