సంజయ్ దత్.. ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సంజయ్ దత్ కు బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఉండేది. అయితే తన బయోపిక్ సంజుతో అది కొంత దూరమైంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా సంజు సూపర్ డూపర్ హిట్ సాధించింది.
ప్రస్తుతం సంజయ్ దత్ ఇండస్ట్రీలో బిజీ నటుడు. సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో ప్రస్తుతం పలు భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో ప్రధానమైంది కేజిఎఫ్ చాప్టర్ 2. కేజిఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన చిత్రమిది. ఈ సినిమా వసూళ్లు చూసి అందరూ షాకయ్యారు. ఒక కోలీవుడ్ చిత్రం ఈ రేంజ్ లో అందరి ఆదరణ పొందుతుందని ఎవరూ అనుకోలేదు.
కేజిఎఫ్ చాప్టర్ 2 లో అధీరా అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు సంజయ్ దత్. అధీరా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేసారు కూడా. ఇది హైలైట్ గా ఉండి అందరి ఆదరణ పొందింది. ఇక అసలు విషయానికొస్తే సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఏకంగా మూడో స్టేజ్ లో ఉంది ఈ ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుతం ముంబైలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ శంషేరా చిత్రంలో నటిస్తున్నాడు సంజయ్ దత్. ఇటీవలే తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పి ఇప్పుడు దుబాయ్ లో హాలిడేకు వెళ్ళాడు. అక్కడ తన పిల్లలను కలుసుకున్నాడు.
లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి సంజయ్ దత్ పిల్లలు ఇద్దరూ దుబాయ్ లోనే ఉండిపోయారు. ఇప్పుడు వారం రోజుల వెకేషన్ కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ తన పిల్లలను కలిసిన ఫోటో రివీల్ అయింది. ఈ లుక్ చూసిన ఎవరైనా కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే సంజయ్ దత్ ఆ ఫొటోలో బాగా చిక్కిపోయి, మొత్తం వెయిట్ లాస్ అయ్యి ఉన్నాడు. సంజయ్ దత్ సినిమాల పరంగా ఇప్పుడు 500 కోట్ల బిజినెస్ నడుస్తోంది. అదీ మ్యాటర్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?