Dil raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ లో కూడా తన నిర్మాణ సంస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ నిర్మాణ సంస్థల భాగ స్వామ్యంతో అక్కడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే జెస్రీ సినిమాను షాహిద్ కపూర్ తో నిర్మిస్తున్నారు. అలాగే తెలుగులో డీసెంట్ హిట్
అందుకున్న హిట్ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. అయితే కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన న్యూస్ ఏదీ రాలేదు. దాంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ హిందీలో ఉండదని అందరూ భావించారు. కానీ తాజాగా దంగల్ సినిమాలో నటించిన సన్యా మల్హోత్రా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇస్తూ తాను ఇందులో నటిస్తున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు.
కాగా టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని ‘హిట్’ చిత్రాన్ని నిర్మించాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావ్ తో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ ని తెరకెక్కించిన శైలేష్ కొలను ‘హిట్’ హిందీ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఆయనకి బాలీవుడ్ లో మొదటి సినిమా. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. టీ సిరీస్ బ్యానర్స్ తో కలిసి దిల్ రాజు, భూషణ్ కుమార్, కిషన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
Dil raju : ‘హిట్’ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.
హిట్ తెలుగులో మూవీలో రుహాని శర్మ నటించగా హిందీలో అదే పాత్రలో సన్యా మల్హోత్రా నటిస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ.. ‘హిట్ టీమ్ లోకి సన్యా కు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. దీనికంటే ముందే సన్యా బాలీవుడ్ మీడియాతో.. నేను ‘హిట్’ సినిమా చూశాను. ఈ మూవీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇందులో రాజ్ కుమార్ రావ్ తో కలిసి నటించబోతుండటం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని తెలిపింది. యంగ్ బ్యూటీ సన్యా మల్హోత్రా ‘దంగల్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ‘పటాఖా’, ‘బధాయ్ హో’, ‘శకుంతలా దేవి’, ‘లూడో’ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకుంది. ఈ క్రేజ్ తోనే ఇప్పుడు రాజ్ కుమార్ రావ్ తో కలిసి ‘హిట్’ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.