Sarada pitham: బ్రాహ్మణ కార్పొరేషన్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ ను బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నిర్ణయంపై బ్రాహ్మణ సంఘాలు, ప్రముఖుల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
ఇదే క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువుగా భావించే విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా ఈ నిర్ణయం సరైంది కాదని భావించారు. ఈ మేరకు శారదా పీఠం నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు శారదా పీఠం తెలిపింది. అగ్రవర్ణాలనన్నింటిని ఈ బిసి జాబితాలో చేర్చాలని శారదా పీఠం ప్రతిపాదిస్తూ ఉందని పేర్కొంది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రభుత్వం నుండి ఉందని ఆశిస్తున్నామని, బ్రాహ్మణులను బీసీ జాబితాలో కి కలపాలని చూస్తే విశాఖ శారదా పీఠం పోరాటం చేస్తుందని హెచ్చరించింది.