Bigg Boss 5 Telugu: యూట్యూబ్ స్టార్ సరియు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో 13వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి.. మొదటి వారంలోనే ఎలిమినేట్ ఇవ్వడం తెలిసిందే. దాదాపు హౌస్ లో వంద రోజుల పాటు ఉంటానని.. షో ప్రారంభం లో చాలా కాన్ఫిడెంట్ గా సరియు చెప్పుకొచ్చింది. అయితే మొదటి వారంలోనే చదువుకి తక్కువ ఓట్లు రావడంతో.. ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఈ తరుణంలో బయటకు వచ్చిన సరియు.. బిగ్ బాస్ షోలో అరియనా కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ లో.. హౌస్ లో రవి, షణ్ముక్, సన్నీ, షిరిడి వీరంతా స్క్రిప్టు పరంగా ఆడుతున్నారని.. వేల నలుగురిలో నే ఒకరు టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందని.. సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇతర ఇంటి సభ్యులు హౌస్ లో రాణించ కుండా ఈ నలుగురు గ్రూప్ లు క్రియేట్ చేయడం జరిగిందని.. తనకి క్రేజ్ ఉండటంతో యాంకర్ రవి తననే టార్గెట్ చేశారని సరియు కాంట్రవర్సీ కామెంట్ చేయడం తెలిసిందే. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ .. అసలు మగాడే కాదు.. అంటూ దారుణంగా తనదైన శైలిలో మరియు ఆ ఇంటర్వ్యూలో మండిపడింది. ఆ తర్వాత మరి ఎక్కడ కూడా సరియు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇటువంటి తరుణంలో తాజాగా సరియు తన యూట్యూబ్ ఛానల్ సెవెన్ స్టార్ లో.. బిగ్ బాస్ హౌస్ అనుభవాలు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా అనేక విషయాలు చెప్పుకొచ్చింది మరియు… షణ్ముఖ్ జస్వంత్ అభిమానుల నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు పేర్కొంది. దారుణంగా బండ బూతులు తిడుతున్నారు అని… అనరాని మాటలు .. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో సైదాబాద్ చిన్నారి కుటుంబ సభ్యులను పలకరించడానికి తాను వెళ్తున్నట్లు దమ్ముంటే షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు అక్కడికి వచ్చి తన పై అటాక్ చేయాలని షణ్ముఖ్ జస్వంత్ అభిమానులకి సవాల్ విసిరింది సరియు.