Sarkar vaari paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ఉ హీరోగా రూపొందుతున్న 27 వ చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్ పతకాలపై డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్నారు.. మహేష్ బాబు అభిమానులు సర్కారు వారి పాట అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా సర్కారు వారి పాట నుండి సూపర్ అప్ డేట్ వచ్చేసింది..
పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మహేష్, కీర్తి సురేష్ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ ఫిబ్రవరి 21 నాటికి పూర్తవుతుందని సమాచారం. అక్కడినుంచి అదే రోజు యూనిట్ హైదరాబాద్ రీచ్ అవుతుంది. ఫిబ్రవరి 21న చిన్న వీడియోను సర్కారు వారి పాట టీం విడుదల చేయనుంది.. ఈ వీడియోలో లొకేషన్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఉంటాయని సమాచారం. 2022 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.