సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట ఆయన కెరీర్ లో 27 వ సినిమాగా తెరకెక్కనుండగా పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ సొంత నిర్మాణ సంస్థ తో పాటు 14 రీల్ ఎంటర్టైన్మైంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమా ముందుగా ప్రత్యేకంగా వేసిన బ్యాంక్ సెట్ లో చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని సమాచారం.
ఇక అల వైకుంఠపురముతో ఇండస్ట్రీ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన ఎస్ ఎస్ థమన్ సర్కారు వారి పాట కి సంగీతమనించబోతున్నాడు. ఏడేళ్ళ క్రితం మహేష్ బాబు సినిమాలకి పనిచేసి సూపర్ హిట్స్ ఇచ్చాడు థమన్. మళ్ళీ ఇన్నాళ్ళకి సర్కారు వారి పాట కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది.
ఇక ఈ మధ్య థమన్ తన మ్యూజిక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం థమన్ చేతిలో ఉన్న భారీ సినిమాలలో మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట ఒకటి. ఇక ఈ సినిమా కొసం అద్భుతమీన్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడట. ముఖ్యంగా సర్కారు వారి పాట అన్న టైటిల్ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్, సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించే అవకాశం ఉందట.
ఇక 2020 ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ఇదే సంవత్సరంలో మరో సినిమాని రిలీజ్ చేయాలనుకున్నాడు. కాని కరోనా కారణంగా ఇప్పుడు సరిలేరు కి సర్కారు వారి పాటకి దాదాపు ఏడాదిన్నర కి పైగానే గ్యాప్ వచ్చేలా కనిపిస్తుంది.