ఏ దర్శకుడికైనా ఒక స్టార్ హీరో తో సినిమా చేసే అవకాశం వస్తే ఆ ఆనందం మామూలుగా ఉండదు. అందులోను సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా అంటే ఏదో సాధించినట్టే ఉంటుంది దర్శకులకి. అయితే అంతకు మించి భయం కూడా చాలా మంది దర్శకులకి ఉంటుందనడంలో సందేహం లేదు. కారణం ఏమిటంటే సూపర్ స్టార్ లాంటి హీరోతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇస్తే ఇక దాదాపు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు ఆ దర్శకుడికి సినిమా ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తిగా ఉంటారు. ఒకవేళ సినిమా రిజల్ట్ కాస్త అటు ఇటు ఐతే సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అదే ఇప్పుడు పరశురాం భయపడుతున్నాడట.
పరశురాం కెరీర్ లో మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అందులో మూడు పెద్ద నిర్మాణ సంస్థలు. అందుకే ఈ సినిమా విషయంలో పరశురాం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఏ చిన్న పొరపాటు జరిగే అవకాశం లేకుండా స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నాడని సమాచారం. ఇక ఇప్పటికే సర్కారు వారి పాట అన్న టైటిల్ మహేష్ బాబు లుక్ జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. మరో హీరోయిన్ కి అవకాశం ఉండగా ఆ హీరోయిన్ ఎవరన్నది ఇంకా డైలమాలోనే ఉన్నారట. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళేందుకు చిత్ర యూనిట్ అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానుల కోసం సర్ప్రైజ్ ని రెడీ చేస్తున్నారట. మహేష్ బాబు వాయిస్ తో ఒక డైలాగ్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అది టైటిల్ బేస్డ్ గా ఉంటుందని అంటున్నారు.