Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ వరుస హిట్లతో ఇండస్ట్రీలో చెలరేగిపోతున్నాడు. మామూలుగానే మహేష్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక సక్సెస్ దారిలో పడిన తర్వాత కోట్లాది మంది అభిమానులు అతనిని ఆరాధిస్తున్నారు. మహేష్ సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి చూపు అటువైపే. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా అయితే మామూలుగా ఉండదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ బాణీలు సమకూరుస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ సినిమా విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. ప్రతి ఏడాది మహేష్ సినిమా సంక్రాంతికి ఖచ్చితంగా ఉంటుంది. ఇక థియేటర్ల వద్ద బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టే మహేష్ ప్రీ- రిలీజ్ బిజినెస్ లో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంపై అన్ని వర్గాల ఆడియన్స్ కు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ రైట్స్ రికార్డు ధర కు అమ్ముడయినట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ కూడా అదే రేంజ్ లో ఉంది అని అంటున్నారు. గతంలో చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమా 32 కోట్లు సాధించినప్పుడు అదే ఎక్కువ అనుకుంటే… ఇప్పుడు సర్కారు వారి పాట డిజిటల్, శాటిలైట్ రైట్స్ రెండు కలిపి 35 కోట్ల ధర పలికినట్లు సమాచారం.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డిజిటల్, శాటిలైట్ రైట్స్ కి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కేజిఎఫ్ సినిమాకి కూడా ఇంత ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. ఆచార్య కూడా డౌటే. ఇక అతి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమా పై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా గనుక హిట్ టాక్ సాధిస్తే బాక్సాఫీసు వద్ద మహేష్ వసూళ్ళ సునామి సృష్టించడం ఖాయం.