టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. గత చిత్రం సరిలేరు నీకెవ్వరుతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని సాధించి బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకున్నాడు. ఇక ఆయన నటిస్తున్న తాజా చిత్రం “సర్కారు వారి పాట”. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా యూనివర్సల్ కాన్సెప్ట్ తో రూపొందనుంది. జీ.ఎం.బీ ఎంటర్టైన్మైంట్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్ తోనే భారీ రికార్డులను సాధించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత మే 31 న విడుదల చేసిన కేవలం ప్రీ లుక్ పోస్టర్ తోనే ట్విట్టర్ లో ఫాస్టెస్ట్ లక్ష లైకులు కొల్లగొట్టిన పోస్టర్ గా ఫస్ట్ ఎవర్ రికార్డును క్రియోట్ చేయగా ఇప్పుడు అదే పోస్టర్ తో ఫస్ట్ ఎవర్ 50 వేల రీట్వీట్స్ ను అందుకున్న పోస్టర్ గా మరో రికార్డును సాధించింది. ఈ సరికొత్త రికార్డు తో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. కాగా సర్కారు వారి పాట సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే భారీ బ్యాక్ సెట్ ని నిర్మించే పనిలో ఉన్నారట. ఆ సెట్ లోనే సర్కారు వారి పాట చిత్రీకరణ మొదలు కాబోతుంది. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, సాయీ మంజ్రేకర్ నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమాని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు.