సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “సర్కారు వారి పాట” అని అందరికీ తెలుసు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేసుకోవడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానులకు అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ మేక్ఓవర్ చాలా కొత్తగా స్టైలిష్ గా మాత్రమే కాక ఊర మాస్ లెవెల్ లో ఉండటంతో పాటు స్టోరీ బ్యాంకు రాబరీ తరహాలో ఉండబోతున్నటు వార్తలు రావడంతో సినిమాపై సామాన్య ప్రేక్షకులకు కూడా ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ తో ఫస్ట్ టైం కీర్తి సురేష్ నటిస్తున్న తరుణంలో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేయాలని ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను సినిమా యూనిట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా ఫిలిం వర్గాల లో టాక్ నడుస్తుంది.
దీంతో రాజమౌళి తో చేసే సినిమాకంటే ముందే పాన్ ఇండియా లెవెల్ లో మహేష్ బాబు ని గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం లాంచ్ చేసినట్లవుతుందని సినీ విశ్లేషకులు తాజా వార్త పై ప్రతి స్పందిస్తున్నారు.