మనుషులు ఇతర జీవుల్లాగే శారీరకంగా కలిసి తద్వారా పిల్లల్ని కంటారు. ఇది ప్రకృతి ధర్మం. అలాంటి ప్రకృతి ధర్మాన్ని ఈమధ్య మనుషులు వ్యతిరేకిస్తున్నారు. నేడు అనేక రూపాలలో పిల్లల్ని కనే అవకాశం వుంది. నానాటికీ పెరిగిపోతున్న సైన్స్ కొన్ని మంచి విషయాలను ఆవిష్కరిస్తే మరికొన్ని దిక్కుమాలిన ప్రయోగాలు చేస్తోంది. అందులో ఒకటే అద్దె గర్భం(సరోగసి). అయితే ఇలాంటి పధ్ధతి ఆపత్కాల పరిస్థితులలో అనుసరించవచ్చు కానీ, మనిషి ఆరోగ్యంగా వున్నపుడు మాత్రం పాటించకూడదు.
ఇక అది చట్ట విరుద్ధం కూడాను. మనదేశంలో దీనికి అనుమతి లేదు. ఒకవేళ దీనికి అనుమతి కోరాలన్నా దానికి చాలా నియమనిబంధనలు ఉంటాయి. మాతృత్వ మధురానుభూతులను అనుభవించాలని ఎవరి ఉండదు. కానీ దానికి ఇలాంటి పద్ధతులు అనుసరిస్తే వీరి ఎలాంటి మాతృత్వ అనుభూతులు పొందుతారో వారికే తెలియాలి. అవును, ముఖ్యంగా హీరోయిన్లు అనబడేవారు ఇలాంటివి ఎక్కువగా అనుసరిస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా మారుతున్నారు. తాజాగా తమిళ యాక్ట్రెస్ నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి విదితమే.
అందమే పెట్టుబడిగా జీవించే తారలు సరోగసి ద్వారా పిల్లల్ని కనడం కొత్తేమి కాదు. గతంలో మంచు లక్ష్మి అదే విధంగా కవలలకు జన్మనివ్వడం తెలిసినదే. అలాగే ఆ లిస్టులో శిల్ప శెట్టి కూడా ఉంటుంది. ఆమె మొదటి సారి అమ్మతనాన్ని డైరెక్ట్ గా రుచి చూసింది. కానీ రెండో బిడ్డకు మాత్రం సరోగసి ద్వారా జన్మ ఇచ్చింది. ఇక ఈ లిస్ట్ లో షారుక్ ఖాన్ దంపతులు ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన చిన్న కొడుకును అద్దె గర్భం ద్వారానే కన్నారు. అలాగే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా ఇలా సరగోసి విధానం ద్వారానే తండ్రి అయ్యాడు.