Sasikala : తమిళనాట tamilanadu అసెంబ్లీ ఎన్నికలు assembly elections సమీపిస్తున్న వేళ అన్నా డీఎంకె anna dmk బహిష్కృత నేత శశికళ తీసుకుంటున్న నిర్ణయం ప్రధాన మంత్రి మోడీ వ్యూహాలను దెబ్బతీయనుందని అనుకుంటున్నారు. తమిళనాడులో ఏఐడీఎంకే పొత్తుతో బీజెపీ లాభపడవచ్చని భావిస్తున్న తరుణంలో అన్నాడీఎంకే ఓటు బ్యాంకు కొల్లగొట్టే విధంగా శశికళ అడుగులు వేస్తోంది. సోమవారం శశికళ తమిళనాడులో అడుగు పెట్టడంతో రాష్ట్ర రాజకీయాలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. పాలక అన్నా డీఎంకే హెచ్చరికలను శశికళ ఖాతరు చేయకుండా తాను ప్రయాణిస్తున్న కారుపై ఆ పార్టీజండా ను ఉపయోగించి తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది.
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలులో నాలుగేళ్లు జైలు శిక్ష ను అనుభవించిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ (శశికళ) ఇటీవల జైలు నుండి విడుదల అయిన సంగతి తెలిసిందే. జైలు నుండి విడుదల అయ్యే సమయంలో కరోనా సోకడంతో కొద్ది రోజులు బెంగళూరులోని రిసార్ట్ లో ఉండిపోయారు. నేడు తమిళనాడులో అడుగు పెట్టారు. పార్టీ నుండి బహిష్కరించినప్పటికీ ఆమె పార్టీ జండా ఉపయోగించడంపై అధికార పార్టీ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
శశికళ తేవార్ వర్గానికి చెందిన నాయకురాలు కాగా తమిళనాడులో ఏఐడీఎంకే పార్టీకి ఈ వర్గం కీలక ఓటు బ్యాంకు. ఈ ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ తీసుకునే వైఖరితో ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే శశికళపై ఆరు సంవత్సరాల పాటు నిషేదం ఉన్న కారణంగా ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోయినా ఏఐడీఎంకేలో చీలికకు కారణం అవ్వవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. బెంగళూరు నుండి తమిళనాడు వరకూ మార్గమధ్యలో శశికళకు స్వాగతం ఫ్లెక్సీలను ఆమె అభిమానులు ఏర్పాటు చేశారు. ప్లెక్సీలపై ఏఐడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి శశికళే నంటూ పేర్కొనడం గమనార్హం. శశికళ రాష్ట్రంలో అడుగు పెట్టడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వెడెక్కింది.