అమరావతి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ మొత్తాన్ని రెండు నెలలుగా జాప్యం చేయడంతో హైకోర్టు ప్రభుత్వంపై నిప్పులు చెరిగి తక్షణమే రైతులకు
ఆ మొత్తాన్ని అందించవలసిందిగా ఆదేశించిన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ కొత్త కహానీతో మీడియా ముందుకొచ్చారు.అయితే ఇది నమ్మశక్యంగా లేకపోవడంతో ఆయన నవ్వుల పాలయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిధులను విడుదల చేసిందని రైతులకు చెల్లించాల్సిన కౌలు – 158 కోట్ల రూపాయలు, రెండు నెలల పెన్షన్ మొత్తం 9.7 మూడు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుందని అన్నారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది…. కానీ నిన్ననే అనగా ఆగస్టు 26వ తేదీన కౌలు రైతుల పెన్షన్ బ్యాంకులో జమ చేశామని బొత్స సత్యనారాయణ చెప్పడం అందరికీ విడ్డూరంగా కనిపించింది. హైకోర్టు విచారణ సమయంలో 27వ తేదీన ప్రభుత్వాన్ని నిలదీసిన తరుణంలో వారు ఏమీ చెప్పలేదు. ఆ తరువాత బొత్స సత్యనారాయణ మీడియా ముందు కి వచ్చి రెండు నెలల నుండి పెండింగ్లో ఉన్న పెన్షన్ నిన్ననే జమ చేశామని సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమైందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంతేకాకుండా ఎంతో విచిత్రమైన రీతిలో కౌలు, రైతుల పెన్షన్ ను ఐదు వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావించిందని అయితే ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడంతో అది సాధ్యపడలేదు అని అని విపక్షాలపై ఒక బండ కూడా వేసేశారు
అంటే ప్రతిపక్షం హైకోర్టు కి వెళ్తే అధికార పక్షం రైతులకు చేయాల్సిన మేలుని చేయకపోవడం ఏమిటో మంత్రి సత్తిబాబుకే తెలియాలి. ఇంకా మంత్రి మాట్లాడుతూ భూహక్కు పత్రాలు అమ్ముకున్న రైతులకు కౌలు చెల్లింపులు జరగవని అన్నారు. అందుకు సంబంధించిన సర్వే జరుగుతోందని ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన వాపోయారు.మంత్రి మీడియా సమావేశంలో చెప్పిన వివరాలను చూశాక ఇది ప్రభుత్వ తప్పిదాన్ని కవర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంగానే స్పష్టమైపోయింది.
నిన్ననే అకౌంట్లో డబ్బులు జమ చేస్తే ఆ ఆధారాలను హైకోర్టు ముందు ఎందుకు పెట్టలేదు? రైతులకు డబ్బులు పెంచేందుకు ప్రభుత్వాన్ని ఏమి ఆపింది? ఇక సర్వే జరుగుతున్న విషయాన్ని కూడా హైకోర్టు ముందు ఎందుకు వెల్లడించలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.కాని జవాబు ఆశించటం అత్యాసే అవుతుంది కదా !