Savings Scheme : చాలామంది ప్రజలు తమ పిల్లల ఉన్నత చదువు, వారి పెళ్లిళ్లు లేదా పదవీ విరమణ ఇలా ఏదో ఒక అవసరం కోసం పొదువు చేయాలని భావిస్తుంటారు. అయితే ఇలాంటి అవసరాలు తీర్చేందుకు చాలానే పొదువు పథకాలు ఉన్నాయి. అందుకే వాటిలో ఏది బెస్ట్ అనేది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం తాజాగా ఆర్థిక నిపుణులు ఒక ఉత్తమమైన పొదుపు పథకాన్ని సిఫార్సు చేశారు. ఇందులో ప్రతి నెలా రూ.1000 రూపాయలు కడితే చాలు రూ.8 లక్షల వరకు పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Savings Scheme : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఆ ఉత్తమమైన పథకం మరేదో కాదు మనందరికీ తెలిసిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకమే! సాధారణంగా దీన్ని పీపీఎఫ్ అని పిలుస్తారు. ఈ పథకంలో నగదు పొదుపు చేయడం ద్వారా ఆర్థిక లక్ష్యాలను ఈజీగా చేరుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తంలో నగదు జమచేసి మెచ్యూరిటీ కాలానికి భారీ అమౌంట్ దక్కించుకోవచ్చు. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీ డబ్బు భద్రంగా ఉంటుంది. అలాగే మీరు జమ చేసిన నగదుపై వడ్డీ కచ్చితంగా లభిస్తుంది. విశేషమేంటంటే.. ఈ పొదుపు మొత్తంపై ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. పొదువు చేసిన నగదు, దానిపై రాబడి, విత్డ్రా మనీపై ఈఈఈ లాంటి ఏ ట్యాక్స్ పడదు.
రూ.1000 కడితే చాలు.. రూ. 8 లక్షలు పొందొచ్చు
ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్ తన పెట్టుబడిదారులకు 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. 15 ఏళ్ల మెచ్యూరిటీ కాలంతో వచ్చే పీపీఎఫ్ లో పెట్టుబడిదారులు క్రమం తప్పకుండా నిర్దిష్ట మొత్తంలో నగదు జమ చేయాల్సి ఉంటుంది. కాలపరిమితి తీరిన తర్వాత డబ్బు అనేది చేతికి దక్కుతుంది. 15 ఏళ్లకు మించి కూడా మీరు డబ్బులు కడుతూ ఉండొచ్చు. ఒక ఏడాదిలో మీరు గరిష్ఠంగా రూ.1.5 లక్షలు.. కనిష్టంగా రూ.500 డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే పీపీఎఫ్ పథకం ద్వారా రూ.8 లక్షలు కూడా సులభంగా పొందవచ్చు. అది కూడా కేవలం వెయ్యి రూపాయలతో!! మీరు 25 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.1000 చొప్పున ఈ పథకంలో జమ చేస్తే మెచ్యూరిటీ కాలానికి మీ చేతికి రూ.8.24 లక్షలు వస్తాయి. అంటే రోజుకు రూ.35 పొదుపు చేసి ఆ మొత్తం ప్రతి నెలా పీపీఎఫ్ పథకంలో డిపాజిట్ చేస్తే 25 ఏళ్లకు ఏకంగా రూ.8 లక్షలు పొందొచ్చు.