SBI : ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మాత్రమే. మీరు SBI ఖాతాదారులైతే మీరు ఈ విషయం గ్రహించాలి. లేదంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం వుంది. అదేమంటే, వచ్చే నెల అనగా మార్చి 31లోపు మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయకుంటే మీ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తోంది సదరు బ్యాంకింగ్ యాజమాన్యం. మీరు మీ బ్యాంకింగ్ సేవలను రన్ చేయాలనుకుంటే సదరు గడువులోగా పాన్ -ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి ఈ క్షణమే పూర్తి చేస్తే మంచిది.
SBI : ఆధార్ పాన్ లింక్ చేయకుంటే జరిగేది ఇదే!
పైన తెలిపిన గడువులోగా ఆధార్, పాన్ లింక్ చేయకపోతే, పాన్ ఇనాక్టివేట్ అవ్వడమే కాకుండా మన SBI అకౌంట్ ద్వారా ఎటువంటి ట్రాన్సక్షన్లు చేయలేము. తద్వారా సౌకర్యంగా బ్యాంకింగ్ సేవల్ని కొనసాగించలేము. కాబట్టి నిరంతరాయంగా బ్యాంకింగ్ సేవను పొందటానికి పాన్ నంబర్ను ఆధార్తో లింక్ చేయవలసిందే. వారు అడిగిన గడువులోగా ఆధార్, పాన్ లింక్ చేయకపోతే క్రెడిట్ కార్డు సర్వీసులను కూడా పొందడానికి వీలు లేకుండా పోతుంది. అందువల్ల కస్టమర్లు ఈ పని ముందుగా పూర్తి చేసుకోండి.
ఎందుకు చేయాలి?
ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 139AA ప్రకారం, మార్చి 31లోపు ప్రతి కస్టమర్ కూడా పాన్తో ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి అని SBI యాజమాన్యం తెలిపింది. ఒకవేళ ఈ గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి సదరు కస్టమర్ పాన్ ఇనాక్టివేట్ అవుతుందని తెలిపారు. క్రెడిట్ కార్డ్ సర్వీసుని పొందాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా యాక్టివేట్ ఉంచుకోవాలి. మరిన్ని వివరాలకు SBI వెబ్సైట్ ని సందర్శించగలరు.