SBI…స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఇటీవల కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల పేరిట ఎలాంటి ఈ-మెయిల్ మరియు ఫోన్లు కి మెసేజ్ లు వచ్చినా దానిని క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. అటువంటి లింక్స్ కలిగిన ఈమెయిల్ క్లిక్ చేస్తే గనుక ఎకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం సైబర్ దాడికి గురవుతుందని ఎకౌంట్ ఖాళీ అయిపోతుందని SBI గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల జూన్ 21వ తారీకు నుండి దేశంలో పెద్ద నగరాల్లో సైబర్ ఎటాక్ తీవ్రస్థాయిలో జరగబోతున్నట్లు వాటికి సంబంధించిన వార్తలు తమ దృష్టికి వచ్చినట్లు sbi ఇటీవల తెలిపింది.
CERT-In నుండి వచ్చిన నివేదిక ప్రకారం సైబర్ నేరస్థులు ఫిషింగ్ అటాక్ క్యాంపెయిన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అనుమానిత ఇమెయిల్ ఐడి [email protected] పేరుతో వస్తుందని పేర్కొంది. ఇమెయిల్ సబ్జెక్ట్ లైన్ ‘ఫ్రీ కోవిడ్ 19 టెస్టింగ్’ అవుతుంది. అందువల్ల [email protected] మెయిల్ ఐడి నుండి ఏదైనా ఇమెయిల్ క్లిక్ చేయకుండా ఉండాలని SBI ఖాతాదారులను హెచ్చరించింది. అంతేకాకుండా ఇప్పటికే సైబర్ నేరస్థుల వద్ద SBI సంస్థకు సంబంధించి 20 లక్షల ఈమెయిల్స్, ఐడిలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, ముంబై నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైరస్ ఎక్కువగా ఈ ప్రాంతంలో విస్తరించడంతో ఖాతాదారులను బురిడీ కొట్టించడానికి ఈ సైబర్ నేరగాళ్లు రెడీ అవుతున్నారని తెలిపింది.