SBI New Rules : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనల వల్ల బ్యాంకు ఖాతాదారులపై ఎంతోకొంత ప్రభావం పడనుంది. ముఖ్యంగా లావాదేవీలు జరిపే వారి విషయంలో కొత్త రూల్స్ ప్రభావం చూపించనున్నాయి. అందుకే ఫిబ్రవరి నుంచి వచ్చే రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
SBI New Rules : కొత్త రూల్స్ ఇవే..!
ఎస్బీఐ బ్యాంకు తాజాగా ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ రూల్స్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చింది. ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) రూల్స్ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న ఐఎంపీఎస్ లిమిట్ను పెంచుతున్నామని ఎస్బీఐ వెల్లడించింది. దీంతో ఇకపై ఖాతాదారులు ఐఎంపీఎస్ ద్వారా సింగిల్ ట్రాన్సాక్షన్ లో రూ.5 లక్షల వరకు నగదు పంపించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ లిమిట్ కేవలం రూ.2 లక్షల వరకే ఉంది. ఈ లిమిట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలామంది ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఐఎంపీఎస్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఎలాంటి రుసుములు వసూలు చేయమని ఎస్బీఐ తాజాగా తెలిపింది. కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ద్వారా ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లకు చేస్తే ఛార్జీలు నుంచి మినహాయింపు పొందుతారు. ఒకవేళ మీరు ఆన్లైన్ పద్ధతిలో కాకుండా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని భావిస్తే ఛార్జీలు వర్తిస్తాయి.
రూల్స్ తీసుకురావడానికి కారణం ఇదే
డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కొత్త రూల్స్ అమలు చేయడానికి రెడీ అయ్యామని ఎస్బీఐ వెల్లడించింది. కొత్త రూల్స్ ఫిబ్రవరి నుంచి అమలులోకి రానుండగా దీన్ని ఖాతాదారులు దృష్టిలో పెట్టుకొని తదుపరి పనులను ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రస్తుతం ఎస్బీఐ టూవీలర్ లోన్ కూడా అందిస్తోంది. ఈ లోన్స్ ను తక్కువ మొత్తం ఈఎంఐలతో ఆఫర్ చేస్తోంది. రూ. 10 వేల రుణ మొత్తానికి రుణగ్రహీతలు ఈఎంఐ రూ. 251 కట్టుకుంటే సరిపోతుంది. రుణ గ్రహీతలు రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 48 నెలల లోగా రుణం చెల్లించాల్సి ఉంటుంది.